Header Banner

ఎయిడ్స్ వ్యాధిని దాచేసి పెళ్లి పీటలెక్కిన వరుడు! తాళికట్టే సమయంలో షాక్!

  Thu Feb 27, 2025 18:55        India

హెచ్ఐవీ ఎయిడ్స్ అనేది ఒక భయంకరమైన వ్యాధి. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీన్ని నివారించడానికి సైంటిస్ట్‌లు అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో సఫలం కావడం లేదు. అయితే ఈ హెచ్ఐవీ సోకిన వారికి చికిత్స మాత్రం అందుబాటులో ఉంది. ఇక ఎయిడ్స్ సోకిన వారు సరైన ట్రీట్‌మెంట్ తీసుకుంటే.. అది సోకినట్లు కూడా ఇతరులకు తెలియకుండా ఉంటుంది. ఇక హెచ్ఐవీ సోకిన వారి వివరాలను కూడా ప్రభుత్వం గోప్యంగా ఉంచుతుంది. అయితే అదే ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి.. తనకు ఎయిడ్స్ సోకిందనే విషయం చెప్పకుండా పెళ్లి నిశ్చయం చేసుకున్నాడు. 

 

హెచ్ఐవీ పాజిటివ్‌గా తేలి 12 ఏళ్లు పూర్తి అయిన తర్వాత.. ఓ వ్యక్తి పెళ్లి చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తీరా తాళికట్టే సమయంలో ఎంటర్ అయిన అధికారులు.. విషయం వధువు కుటుంబ సభ్యులకు చెప్పడంతో పెళ్లి పీటల మీదే పెటాకులు అయింది. గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణం పరిధిలోని క్రిస్టియన్‌పేటలోని ఓ చర్చిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. తాడేపల్లికి చెందిన ఓ 35 ఏళ్ల వ్యక్తికి 2013లో హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఎయిడ్స్‌కు చికిత్స తీసుకుంటూ ఆరోగ్యంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 

 

ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

క్రిస్టియన్‌ పేటలోని ఓ చర్చిలో పెళ్లి జరుగుతుండగా.. అధికారులకు సమాచారం అందింది. వెంటనే ఏపీ ఎన్జీఓ అధికారులు అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హెచ్ఐవీ సోకిన వ్యక్తి పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన హెచ్‌ఐవీ ప్రాజెక్ట్‌ జిల్లా మేనేజర్‌ శాంసన్‌.. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. వరుడికి హెచ్‌ఐవీ ఉన్న విషయాన్ని వధువు తరఫున కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పడంతో వారు ఆ పెళ్లిని అర్ధాంతరంగా నిలిపివేశారు. 

 

ఈ క్రమంలోనే చివరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో పెళ్లి కొడుకు బంధువులు, వధువు బంధువుల మధ్య గొడవ తలెత్తింది. వరుడికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ ఉంటే ఎలా వివాహం జరిపిస్తామని పాస్టర్‌ చెప్పడంతో పెళ్లికొడుకు బంధువులు పెళ్లి కుమార్తె బంధువులపై దాడికి పాల్పడ్డారు. దీంతో చర్చి ప్రతినిధులు పోలీసులకు సమాచారం అందించగా.. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేశారు. ఏపీఎన్జీవోస్‌ అధికారులు ఈ విషయాన్ని బహిరంగం చేయాలని అనుకోవడం లేదని.. గొడవ చేయవద్దని చెప్పినప్పటికీ వరుడి తరఫు బంధువులు వినకుండా దాడి చేశారని హెచ్‌ఐవీ డిస్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ తెలిపారు.

 

ఇది కూడా చదవండి
వైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!  

 

మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు! 

 

గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!  

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!  

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం! 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #India #Wedding #Marriage #HIV #Aids